BIG BREAKING: సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 25 వరకు సీబీఐ కేసులో కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 12 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Kejriwal Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 25 వరకు సీబీఐ కేసులో కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో సుప్రీం నుంచి మధ్యంతర బెయిల్ దక్కినా జైలులోనే కేజ్రీవాల్ ఉండనున్నారు. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు లో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ (Ed) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. సీఎం కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని సుప్రీం పేర్కొంది. అతను దాదాపు 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని చెప్పింది. ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 17న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ కు ఉరటనిస్తూ మధ్యంతరం బెయిల్ ను మంజూరు చేసింది. Also Read: కాంగ్రెస్లో BRSLP విలీనం.. దానం సంచలన వ్యాఖ్యలు #delhi-liquor-scam-case #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి