CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు

AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

New Update
CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు

CM Chandrababu Uttarandhra Tour : కాసేపట్లో ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) వెళ్లనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు. 10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ (Gannavaram Airport) కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 11.20కి అనకాపల్లి దార్లపూడి దగ్గర పోలవరం (Polavaram) లెఫ్ట్‌ కెనాల్‌ పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భోగాపురుం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

12:30-1:30 వరకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 2:30కు మెడ్ టెక్ జోన్ భవనాలను ప్రారంభిస్తారు. 4:50కి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులతో సమీక్ష చేస్తారు. 6గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగుపయనం కానున్నారు.

Also Read : అకౌంట్లోకి రూ.15 వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు