CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ

AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

CM Chandrababu To Visit Delhi : సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) అనంతరం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీ (Delhi) కి చేరుకుంటారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ (NITI Aayog) ముందు ప్రతిపాదనలు చేయనున్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్రం ముందు గళం ఎత్తనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.

Also Read : భార్యతో కలిసి బెంగళూరుకు జగన్



#ap-cm-chandrababu #delhi #niti-aayog
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి