CM Chandrababu : నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల సమావేశం జరగనుంది. ఈనెల 24 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. అలాగే టీడీపీ పార్లమెంటరీ నేతను ప్రకటించనున్నారు

CM Chandrababu : నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
New Update

CM Chandrababu Hold Meeting : సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన టీడీపీ (TDP) పార్లమెంటరీ నేతల సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సా. 4 గం.కు భేటీ కానున్నారు. టీడీపీ పార్లమెంటరీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. అయితే, పార్లమెంటరీ నేత ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్‌సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఉంది. ఈనెల 24 నుంచి లోక్‌సభ సమావేశాలు (Lok Sabha Meetings) ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు.

Also Read : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష

#ap-tdp #lok-sabha-meetings #cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe