Senthil Kumar: సెంథిల్ కుమార్ ఇంట్లో విషాదం.. 'రూహి' ఇకలేరు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. By srinivas 15 Feb 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (Senthil Kumar) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన భార్య రూహి (Roohi) కన్నుమూశారు. యోగా టీచర్ గా గుర్తింపు పొందిన ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఇది కూడా చదవండి: Telangana: హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. రేవంత్ ఇక రూహి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించబోతున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఇక సెంథిల్ 2009లో రూహిని పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇక రూహి అనారోగ్యం కారణంగానే సెంథిల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వగా.. ‘ఐతే’ సినిమాతో సెంథిల్ కెరీర్ ప్రారంభించారు. రాజమౌళికి ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్గా ఉండేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు సెంథిల్ డీపీవోగా పనిచేశారు. #hyderabad #cinematographer #ruhi-passed-away #senthil-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి