/rtv/media/media_files/2025/03/25/1UiqOqXtnp7P3z31BBf8.jpg)
Jana Nayagan release date
Jana Nayagan: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్' మూవీ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14, 2026న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. 'జన నాయగన్' విజయ్ చివరి ఫిల్మ్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, నరేన్, మమిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Adiyum othaiyum kalanthu vechu vidiya vidiya virundhu vecha.. #JanaNayaganPongal 🔥
— KVN Productions (@KvnProductions) March 24, 2025
09.01.2026 ❤️#JanaNayaganFromJan9#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss… pic.twitter.com/hIhBlFWVzg
రాజకీయాల్లో బిజీ
ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. తాను కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ నుంచి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో జరిగిన ఒక ర్యాలీలో కూడా విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తాను రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా విజయ్ 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈమూవీలో త్రిష, మీనాక్షి చౌదరీ, స్నేహ, ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Kamal Haasan Controversy: కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. దీని కారణంగా ‘థగ్ లైఫ్’ మూవీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టిలోగా అతడు కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC తెలిపింది.
Kamal Haasan Thug Life movie will stop in karnataka
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుండగా.. తమ రాష్ట్రంలో ‘థగ్ లైఫ్’ను విడుదల కానివ్వం అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) హెచ్చరించింది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగానే తాజాగా కేఫ్సీసీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
క్షమాపణలు చెప్పకపోతే
ఇవాళ్టీ లోగా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పలేదంటే.. అతడు నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్ను తమ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ఇదే విషయాన్ని కమల్ హాసన్తో కలిసి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు KFCC స్పందిస్తూ.. కమల్ హాసన్ సినిమాను నిషేందించాలని రాష్ట్రంలోని పలు గ్రూప్లు డిమాండ్ చేస్తున్నాయని.. దీనిపై భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యామని తెలిపింది. ఇందులో కమల్ తప్పుచేశారని ఒక అభిప్రాయానికి వచ్చి.. అతడు క్షమాపణలు చెప్పాల్సిందేనని నిర్ణయానికి వచ్చామని పేర్కొంది. ఇదే విషయంపై కమల్ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఇందులో భాగంగా కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు మాట్లాడుతూ.. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయన నటిస్తున్న సినిమా రిలీజ్ను అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు. ఆయనపై ఎలాంటి సానుభూతి లేదని.. క్షమాపణలు చెప్పని తరుణంలో కన్నడ సంఘాలతో కలిసి తామంతా నిరసన చేస్తామని తెలిపారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
కమల్ కాంట్రవర్సీ కామెంట్స్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ఇటీవలే చెన్నై లో తన రాబోయే సినిమా 'తగ్ లైఫ్' ఆడియో రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని అన్నారు. దీంతో వివాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు కమల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు