/rtv/media/media_files/2025/06/13/ZFbjYgyTJFGmityq0VOW.jpg)
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ (ఫ్లైట్ AI-171) టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా 242 మంది చనిపోయారు. ఈ విషాదకరమైన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అయితే విమాన ప్రమాదం జరుగుతుందని ప్రముఖ జోతిష్య నిపుణుడు వేణుస్వామి ముందే చెప్పారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ చేస్తున్నారు. 2025 ఉగాది పండుగ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎక్కువగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు కూడా జరుగుతాయన్నారు. అంతేకాకుండా ప్రకృతి పరంగా భూకంపాలు అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో తాజాగా జరిగిన విమాన ఘటనను లింక్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు.