/rtv/media/media_files/2025/02/14/RHAvN6mYliLZhlqnZat4.jpg)
Chandra Sekhar Yeleti
తెలుగు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి యేలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. యేలేటి సుబ్బారావు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని రేఖవానిపాలెం గ్రామం. ఆక్కడే ఆయన కన్నుమూశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య రమ యేలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. యేలేటి సుబ్బారావు మృతిపట్ల సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. యేలేటి సుబ్బారావు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.
Also Read : WPL 2025 : ఇవాళ్టి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ఆసక్తికరంగా తొలి మ్యాచ్!
రొటీన్ సినిమాలకంటే భిన్నంగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలకంటే విభిన్నమైన సినిమాలు తీస్తారనే పేరు చంద్రశేఖర్ యేలేటికి ఉంది. ఐతే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చు కాగా ఏకంగా రూ.6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. అంతేకాకుండా ఉత్తమ కథగా నంది అవార్డును అందుకుంది.
ఆ తరువాత అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా వంటి విజయవంతమైన సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అమృతం సీరియల్ ను తెరకెక్కించిన గుణ్ణం గంగరాజు ఆయన బంధువు. ఆయన వద్ద లిటిల్ సోల్జర్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అమృతం సీరియల్ కు మొదటి పది ఎపిసోడ్లకు దర్శకత్వం కూడా వహించారు చంద్రశేఖర్ యేలేటి. 2021లో హీరో నితిన్ తో ఆయన చెక్ అనే సినిమాను తీశారు కానీ అంతగా ఆకట్టుకోలేదు.
Also Read : Laila movie : విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!