/rtv/media/media_files/2025/01/31/o9hQoNkPxMFLO4I4M2Pp.jpg)
Vedarajuu Timber Photograph: (Vedarajuu Timber)
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
నిర్మాత వేదరాజు టింబర్ మృతి:
— L.VENUGOPAL🌞 (@venupro) January 31, 2025
అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్
(54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో… pic.twitter.com/TOsMX4D6XY
కన్స్ట్రక్షన్స్ బిజినెస్ చేసే వేదరాజు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అల్లరి నరేష్ తో మడతకాజా, సంఘర్షణ సినిమాలు తీశారు. ఇందులో మడతకాజా సూపర్ హిట్ కాగా.. సంఘర్షణ ఆకట్టుకోలేదు. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన 2021లో హీరో శ్రీవిష్ణుతో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మాత వేదరాజు టింబర్ మృతి:
— VIJAYACHITRA (@TheVijayaChitra) January 31, 2025
అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్
(54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో… pic.twitter.com/zwhHwuHDXU
ఒక గొప్ప నిర్మాత అనారోగ్య సమస్యలతో మరణించడం నిజంగా బాధాకరమని పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.