/rtv/media/media_files/2025/03/22/thaUvm21pEqVDHxCuwfd.jpg)
ప్రముఖ నటుడు రాకేష్ పాండే కన్నుమూశారు. ఆయనకు ప్రస్తుతం 77 సంవత్సరాలు. ముంబైలోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో గుండెపోటుతో చనిపోయారు. రాకేష్ పాండే తన కెరీర్లో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. నేటికీ ఆయన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి. రాకేష్ పాండే అంత్యక్రియలు శాస్త్రి నగర్ శ్మశానవాటికలో జరగగా.. ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Also read : చికెన్లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?
Actor Rakesh Pande is no more
— Pavan Jha (@p1j) March 22, 2025
There was a time when he was considered a big star than BigB as producers replaced Bachchan with him as he was considered next big thing at one time...
Although Rakesh Pandey was a limited actor and later didn't care care of his physique, he got… pic.twitter.com/UIvkDRahpK
అద్భుతమైన నటనకు రాష్ట్రపతి అవార్డు
రాకేష్ పాండేకు భార్య, కుమార్తె జాస్మీత్ మరియు మనవరాలు ఉన్నారు. రాకేష్ పాండే 1940 ఏప్రిల్ 9న హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు.1969లో సారా ఆకాష్తో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు రాకేష్ . ఇందులో ఆయన చేసిన అద్భుతమైన నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. బాలీవుడ్లోనే కాకుండా భోజ్పురి పరిశ్రమలో కూడా నటించారు రాకేష్ పాండే. యే హై జిందగీ, వో మై నహీ, దేవదాస్, దిల్ చాహ్తా హై, లక్ష్య, బ్లాక్ వంటి గొప్ప చిత్రాలలో నటించారు. చోటి బహు, దహ్లీజ్ వంటి టీవీ సీరియల్స్లో కూడా ఆయన నటించారు. చివరిసారిగా ఆయన 2023 చిత్రం 'ది రైజ్ ఆఫ్ సుదర్శన్ చక్ర'లో కనిపించారు.
Also read : రహానే హిట్టు... కోల్కతా ప్లాప్ .. బెంగళూరు టార్గెట్ 175
Also read : యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత