Ek Din Teaser: అమీర్ ప్లాన్ వేరే లెవెల్.. 'సితారే జమీన్ పర్' చిత్రంలో సాయి పల్లవి- జునైద్ 'ఏక్ దిన్' టీజర్

అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్- సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'ఏక్ దిన్' టీజర్ రేపు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపు థియేటర్లలో విడుదల కానున్న అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చిత్రంతో పాటు ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారని సమాచారం.

New Update

Ek Din Teaser:  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్- సాయి పల్లవి జంటగా హిందీలో 'ఏక్ దిన్'  రొమాంటిక్ డ్రామా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రమోషనల్ స్టాటజీ 

ఈ సినిమా టీజర్‌ను రేపు థియేటర్లలో విడుదల కానున్న అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చిత్రంతో పాటు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్ ని అమీర్ ఖాన్ సినిమాతో పాటు విడుదల చేయడం ఒక విధమైన ప్రమోషనల్ స్ట్రాటజీ అని తెలుస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అమీర్ నుంచి వస్తున్న 'సితారే జమీన్ పర్' భారీ అంచనాలతో విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా కోసం పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో జునైద్ టీజర్ ను విడుదల చేయడం ద్వారా సినిమా రీచ్ ఎక్కువగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. 

 'స్నో ఫెస్టివల్' లో షూటింగ్ 

2023 డిసెంబర్‌ ముంబైలో మొదలైన ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.  ఇటీవలే  జపాన్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం అక్కడికి వెళ్లింది.  జపాన్‌లోని అత్యంత సుందరమైన నగరం 'సపోరో' లో  స్నో ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఈ షెడ్యూల్ చిత్రీకరించినట్లు సమాచారం. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు అద్భుతమైన దృశ్యరూపాన్ని  ఇస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.  2011లో వచ్చిన కొరియన్ చిత్రం 'వన్ డే' నుంచి ప్రేరణ పొంది 'ఏక్ దిన్' చిత్రాన్ని రూపొందించినట్లు టాక్.  ఈ ఏడాది ప్రేమికులు దినోత్సవం సందర్భంగా సినిమాను  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్‌డే కాజల్.. అగ్రతారగా 'చందమామ' సినీ ప్రయాణం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు