Kothapallilo Okappudu: రానా దగ్గుపాటి నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్ విడుదలైంది. 'కొత్తపల్లి' అనే గ్రామం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను రూపొందించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకంటోంది. పచ్చటి పొలాలు, మట్టి రోడ్లు, బాల్యం ప్రేమలు పల్లెటూరి జీవితాన్ని గుర్తుచేస్తున్నాయి. హీరో హీరోయిన్ల అమాయకమైన ప్రేమ, సంభాషణలు ఆకట్టుకున్నాయి. అప్పటివరకు సరదాగా సాగిన ఈ ఊరి కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఊళ్ళో ఏదో అలజడి మొదలవుతుంది! ఆ మిస్టరీ ఏంటి అనేదే 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కథ. మొత్తానికి ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
ఇందు మూలాన యావత్ తెలుగు ప్రేక్షకులకు తెలియజేయునది ఏమనగా...#KothapalliloOkappudu
— Rana Daggubati (@RanaDaggubati) July 10, 2025
Trailer out now: https://t.co/6RDoPeDx6U
In cinemas on July 18th.@IamPraveenaP#ManiSharma#VarunUnni#PetrosAntoniadis@SpiritMediaIN#ParuchuriVijayaPraveenaArts#KothapalliloOnJuly18pic.twitter.com/0W5tFBDx92
జులై 18న విడుదల
'కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మనోజ్, మౌనిక హీరోహీరోయిన్లుగా నటించారు. అవింద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జులై 18న థియేటర్స్ లో విడుదల కానుంది. రూటీన్ కథలకు భిన్నంగా మలచిన ఈ గ్రామీణ డ్రామా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!