Ram Charn Wax Statue: అబ్బా భలే ఉంది.! మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం (వీడియో వైరల్)

లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు ఉపాసన, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
ram charan wax statue Madame Tussauds

ram charan wax statue Madame Tussauds

Ram Charn Wax Statue:  టాలీవుడ్ స్టార్  హీరో రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్  టుసాడ్స్ మ్యూజియం లండన్ లో   ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖా, ఉపాసన కొణిదెల హాజరయ్యారు. చరణ్ తో పాటు ఆయన పెంపుడు కుక్క 'రైమ్' కి కూడా టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కింది.   రైమ్ మైనపు బొమ్మను కూడా తయారు చేశారు.  

రెండవ సెలబ్రిటీ

మేడమ్ టుస్సాడ్స్ లో పెంపుడు కుక్కతో   కలిసి  మైనపు విగ్రహం పొందిన రెండవ సెలబ్రిటీ చరణ్ కావడం విశేషం. మొదటగా రాణి ఎలిజిబెత్ 2 కి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ తన పెట్ డాగ్ రైమ్ తో స్టేజ్ పైకి వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైమ్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. 

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో  'పెద్ది' మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో చరణ్ మాస్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.  2026 మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా  నటిస్తోంది. 

latest-news | Ram Charan wax statue Madame Tussauds | cinema-news | telugu-cinema-news

Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు