/rtv/media/media_files/2025/09/03/rajamouli-met-kenya-minister-2025-09-03-13-03-40.jpg)
Rajamouli met Kenya minister
SSMB29 Rajamouli: 'RRR' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'SSMB29'. తొలిసారి రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి కూడా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. హాలీవుడ్ చిత్రం 'ఇండియానా జోన్స్' తరహాలో ఇది ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇదొక విజువల్ వండర్ గా ఉండబోతుందని టాక్. ఇందుకోసం రాజమౌళి చిత్రబృందం దేశవిదేశాల్లోని అందమైన లొకేషన్స్ ని షూటింగ్ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవలే ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదవాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. షూటింగ్ కి కావాల్సిన అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాసేపు కాసేపు ముచ్చటించిన రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మంత్రి ముదావాది తన ట్విట్టర్ లో పంచుకున్నారు. కెన్యాలోని సుందరమైన ప్రదేశాలను తన చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents.
— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025
Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64