Bahubali మహేంద్ర బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. 8th యానివర్సరీకి అదిరిపోయే సర్ప్రైజ్

సౌత్ ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన బాహుబలి మరోసారి వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బాహుబలి 2 8th యానివర్సరీ సందర్భంగా అక్టోబర్ లో గ్రాండ్ రీరిలీజ్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు

New Update

మహేంద్ర బాహుబలి మరోసారి ప్రేక్షకులను మాయలో ముంచేయడానికి వస్తున్నాడు. ఏప్రిల్ 28తో బాహుబలి2 విడుదలై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 8th యానివర్సరీ సందర్భంగా అక్టోబర్ లో మూవీ గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని  నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు.

రీ రిలీజ్ పై నిర్మాత ట్వీట్ 

''ఈ సంవత్సరం అక్టోబర్ లో  'బాహుబలి 2' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే  కాదు, మా ప్రియమైన అభిమానులకు వేడుకల సంవత్సరం అవుతుంది'' అంటూ ట్వీట్ చేశారు. రీ రిలీజ్ కి 6 నెలల ముందే అనౌన్స్ చేయడం చూస్తుంటే.. ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సారి రిలీజైనప్పుడు ఎలా సంచలనం సృష్టించిందో మళ్లీ అలాంటి అనుభూతిని తెచ్చేలా రీ రిలీజ్ ఏర్పాట్లు  జరుగుతున్నట్లు టాక్.

విజువల్ వండర్‌

2017లో  ప్రభాస్, రాజమౌళి కాంబోలో విడుదలైన ఈ విజువల్ వండర్‌ సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20000 కోట్లకి పైగా  వసూళ్లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన  'బాహుబలి' మరోసారి వెండితెరపై సందడి చేయనుండడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తితింది. 

latest-news | telugu-news | bahubali | Bahubali 2 re release

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు