/rtv/media/media_files/2025/10/13/lakshmi-pranathi-2025-10-13-13-57-15.jpg)
Lakshmi Pranathi
Lakshmi Pranathi: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో, ఆమె తాజాగా పెళ్లి చేసుకున్న వధూవరులు నార్నె నితిన్, లక్ష్మీ శివానిలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో తితిదే అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తాజాగా హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో నార్నె నితిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహం 2025 అక్టోబర్ 10న శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో బహుళంగా జరిగింది.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
నితిన్ ఎన్టీఆర్కు బావమరిది కావడం, ఈ పెళ్లికి మిగతా కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ హాజరవడం విశేషం. వీరిదంతా పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాను హీరో అయినా, కుటుంబ బాధ్యతల్లో ముందుండే ఎన్టీఆర్ ఈ వివాహాన్ని తన చేతుల మీదుగా ఎంతో జాగ్రత్తగా నడిపించారు.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానిని నితిన్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలో ప్రతి అథిథిని ప్రత్యేకంగా స్వాగతిస్తూ, అన్ని కార్యక్రమాలు సజావుగా జరగేలా ఎన్టీఆర్ కుటుంబం చురుకుగా వ్యవహరించింది. శ్రీవారి ఆశీస్సులతో నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆరంభించడం విశేషంగా నిలిచింది.
Follow Us