Nayanthara: ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నయనతార ఎమోషనల్ పోస్ట్

విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన 'నేను రౌడీనే' చిత్రం విడుదలై 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నయనతార తన సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ పెట్టారు. భర్త విఘ్నేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు.

New Update
nayan

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిని కలిపిన సినిమా 'నేను రౌడీనే'. ఈ సినిమాకు విగ్నేష్ దర్శకుడు. నయన్ తార హీరోయిన్. ఈమూవీ టైంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, చివరికి పెళ్ళికి దారిసింది. అయితే వీళ్ళిద్దరిని కలిపిన 'నేను రౌడీనే' మూవీ విడుదలై నేటితో 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

వాళ్లకు ఋణపడి ఉంటా..

ఈ  సందర్భంగా నయన్ తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్ట్‌ పెట్టింది. భర్త విఘ్నేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందని ఎమోషనల్ అయింది." ‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. 

Also Read : 'దేవర' నుంచి ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది.." అంటూ నయన్ తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక 'నేను రౌడీనే' సినిమా విషయానికొస్తే.. విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం 2015ల లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇది విడుదలైన ఏడేళ్ల తర్వాత  2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు కవలలు జన్మించారు.

Also Read : 'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్

#nayanthara #shivan-vignesh
Advertisment
Advertisment
తాజా కథనాలు