Yevade Subramanyam: ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు: నాగ్ అశ్విన్

కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ "ఎవడే సుబ్రమణ్యం" పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

New Update
Yevade Subramanyam

Yevade Subramanyam

Yevade Subramanyam: కల్కి(Kalki) మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరెక్షన్లో వచ్చిన కల్ట్ క్లాసికల్ మూవీ "ఎవడే సుబ్రమణ్యం" ఈ సినిమాలో నాని(Nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. 2015లో విడుదలై సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ.  

Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

అయితే నాగ్ అశ్విన్ కి ఇది మొదటి సినిమా ఇప్పటికి ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా  రీ రిలీజ్ తో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది ఈ మూవీ. అయితే నాగ్ అశ్విన్ తాజాగా ఈ మూవీ పై కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

యువతకి "ఎవడే సుబ్రమణ్యం" ఇన్స్పిరేషన్: నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి ఈ సినిమాను మళ్ళీ అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని, యువతరానికి "ఎవడే సుబ్రమణ్యం" ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఇప్పటికి ఈ మూవీ చూడని వారుంటే ఈ సారి థియేటర్లో అస్సలు మిస్ అవ్వొద్దు, సినిమాను చూసి ఎంజాయ్ చేయండి" అని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

అయితే "ఎవడే సుబ్రమణ్యం" ఈ నెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. అందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు