/rtv/media/media_files/2025/03/19/PRDohseBNneP2wGYgbuX.jpg)
Yevade Subramanyam
Yevade Subramanyam: కల్కి(Kalki) మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరెక్షన్లో వచ్చిన కల్ట్ క్లాసికల్ మూవీ "ఎవడే సుబ్రమణ్యం" ఈ సినిమాలో నాని(Nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. 2015లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
అయితే నాగ్ అశ్విన్ కి ఇది మొదటి సినిమా ఇప్పటికి ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా రీ రిలీజ్ తో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది ఈ మూవీ. అయితే నాగ్ అశ్విన్ తాజాగా ఈ మూవీ పై కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
యువతకి "ఎవడే సుబ్రమణ్యం" ఇన్స్పిరేషన్: నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి ఈ సినిమాను మళ్ళీ అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని, యువతరానికి "ఎవడే సుబ్రమణ్యం" ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఇప్పటికి ఈ మూవీ చూడని వారుంటే ఈ సారి థియేటర్లో అస్సలు మిస్ అవ్వొద్దు, సినిమాను చూసి ఎంజాయ్ చేయండి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
అయితే "ఎవడే సుబ్రమణ్యం" ఈ నెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. అందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.