Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. 'కన్నప్ప' పై మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం!

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నేపథ్యంలో మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. విమాన ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కుటుంబాలకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

New Update

Plane Crash: గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.  ఈ ప్రమాదంపై  దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మంచు విష్షు కూడా ఈ ఘటన పై స్పందించారు.  అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. అలాగే  ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కుటుంబాలకు సంతాపంగా.. ఈనెల 13న విడుదల కావాల్సిన తన  'కన్నప్ప' మూవీ ట్రైలర్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు రేపు  మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరిగా  మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.  ఇదిలా ఉంటే కన్నప్ప చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. 

మంటల్లో కాలిపోయిన ప్రయాణికులు 

అయితే  అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్ట్ నుంచి  250కి పైగా ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. సాంకేతిక లోపంతో  బిల్డింగ్ కి తగిలి మొత్తం క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ మంటల్లో కాలిపోవడంతో.. దాదాపు  విమానంలో ఉన్న ప్రయాణికులంతా చనిపోయినట్లు సమాచారం. 

Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్‌ బర్త్‌డే స్పెషల్‌.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు