Kannappa: మంచు విష్ణు 'కన్నప్ప' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 115,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ''కేవలం 24 గంటల్లో 115,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ రకమైన ప్రీ-రిలీజ్ ప్రేమ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 'కన్నప్ప' కు తిరుగులేని మద్దతు ఇచ్చిన ప్రతి సినీ ప్రేమికుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
115,000 tickets sold in just 24 hours.
— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025
My heart is racing! 🙏🏽
To witness this kind of pre-release love and anticipation is truly humbling.
I’m deeply grateful to every movie lover for the unwavering support.
This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…
అంతర్జాతీయ స్థాయి వీఎఫెక్స్
ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికాలో 'కన్నప్ప' ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ఇండియాలో ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. శివ భక్తుడు 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా పై మంచు విష్ణు అండ్ అండ్ టీమ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే హిందీ ఫైనల్ కాపీని పలువురు సినీ ప్రముఖుల చూపించగా.. వారి నుంచి మంచి స్పందన వచ్చినట్లు విష్ణు తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో నిర్మించారు. ఈ సినిమాలోని వీఎఫెక్స్, భారీ లొకేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్, మోహన్ బాబు వంటి స్టార్ కీలక పాత్రల్లో నటించారు.
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు