Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!

నటి కంగనా రనౌత్ మనాలిలోని తన ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అసలు తాము నివాసమేలేని ఇంటి అంత బిల్లు ఎలా వచ్చిందంటూ మండిపడ్డారు.

New Update
Kangana Ranaut on getting 1lakh electricity bill

Kangana Ranaut on getting 1lakh electricity bill

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓవైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరైన కంగనా.. మనాలిలోని తన ఇంటికి  రూ. లక్ష కరెంట్ బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెలవారీ విద్యుత్ బిల్లు రూ. లక్ష దిగ్భ్రాంతికరమైన విషయమని పంచుకున్నారు. తాను ప్రస్తుతం నివసించని ఇంటికి రూ. లక్ష బిల్లు విధించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని  విమర్శించారు.  రాష్ట్రంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని అన్నారు. నా సోదర, సోదరీమణులు నేను కోరేది ఒక్కటే మనమంతా ఇలాంటి సమస్యలపై  క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత మనది అని తెలిపారు. 

 latest-news | telugu-news | actress-kangana-ranaut 

Advertisment
Advertisment
తాజా కథనాలు