Sitaare Zameen Par: అమీర్ ఖాన్ 2007లో విడుదలైన సూపర్ హిట్ తారే జమీన్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’. జూన్ 20న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే మే 8న ఈమూవీ ట్రైలర్ విడుదల చేయాల్సి ఉండగా.. భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు మేకర్స్. దేశ సైనికుల పట్ల గౌరవం చూపించేందుకు, దేశ ఐక్యతకు సహకరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ తెలిపింది. దీంతో విడుదల కూడా పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
సినిమా పోస్ట్ ఫోన్..?
Official :#AamirKhan's #SitaareZameenPar Trailer Postponed.
— Ashwani kumar (@BorntobeAshwani) May 10, 2025
"Concerning the ongoing developments at the country’s borders and the nationwide alert, Aamir Khan Productions have decided to postpone their upcoming film Sitaare Zameen Par's trailer. Our thoughts are with the brave… pic.twitter.com/hGAgedfgkZ
ఆర్.ఎస్. ప్రసన్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో.. జెనీలియా డిసూజా మరి కొంతమంది పిల్లలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే మ్యాడాక్ ఫిల్మ్స్ సంస్థ కూడా యుద్ధ నేపథ్యంలో తమ చిత్రాన్ని (‘భూల్ చుక్ మాఫ్’) థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న అప్రమత్తతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు త్తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. "దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల పట్ల మేము సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఐక్యత చూపించాల్సిన అవసరం ఉంది" అని తెలిపారు.