Sanam Teri Kasam: 2016లో విడుదలైన బాలీవుడ్ సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా 'సనమ్ తేరి కసమ్' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హిందీతో తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ సినిమా స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకేన్ జంటగా నటించారు. సినిమాలో వీరి కెమిస్ట్రీ, నటనకు ఆడియన్స్ ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో మరోసారి వీరిద్దరిని కలిసి చూడాలని.. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలా అయితే నటించను..
ఈ క్రమంలో హీరో హర్షవర్ధన్ రాణే 'సనమ్ తేరి కసమ్ 2' సినిమా ఆఫర్ను తిరస్కరించారు. హీరోయిన్ మావ్రా 'ఆపరేషన్ సిందూర్' పై చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ఇటీవలే పాకిస్థాన్ నటి మావ్రా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడంపై హర్షవర్ధన్ అసహనం వ్యక్తం చేశారు. భారత్ పై ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. దీంతో పార్ట్ 1లో యాక్ట్ చేసిన వారు సీక్వెల్లో ఉంటే తాను సినిమా చేసేందుకు సిద్ధంగా లేనని వెల్లడించారు.
/rtv/media/media_files/2025/05/11/ML3bXt6ww8GbV0tuCySV.png)
హీరో పోస్ట్
హీరో హర్షవర్ధన్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. ''నా దేశం గురించి చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యలను చదివిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గతంలో నటించిన వారే.. ఇప్పుడు కూడా నటించే అవకాశం ఉంటే.. 'సనమ్ తేరి కసం' పార్ట్ 2లో భాగం కావడాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నాను'' అని తెలిపారు.
అలాగే మరో పోస్టులో నటి మావ్రా చేసిన పోస్టును షేర్ చేశారు. ఏ దేశానికి చెందిన నటులైన నేను గౌరవిస్తాను.. కానీ నా దేశాన్ని చులకనగా చేసి మాట్లాడితే సహించలేను. నీ దేశానికి మద్దతుగా నిలవడం మంచిదే.. కానీ పక్క దేశంపై విషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని అన్నారు హర్షవర్ధన్. హర్షవర్ధన్ నిర్ణయంపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన హీరో అంటే నువ్వే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
telugu-news | latest-news | cinema-news | Sanam Teri Kasam sequel