ఆ హీరోకైతే విలన్ గా చేయడానికి నేను రెడీ : గోపీచంద్

హీరో గోపీచంద్ 'విశ్వం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విలన్ రోల్స్ చేయడం గురించి మాట్లాడారు. నన్ను అందరూ విలన్ గా చేయమని చెప్తున్నారు. నాకంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ప్రభాస్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వస్తే చేస్తానని అన్నారు.

New Update
gopi

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'జయం' మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. వర్షం, నిజం సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. హీరో అయ్యాక మళ్ళీ నెగిటివ్ రోల్ చేయలేదు. కానీ ఆడియన్స్ మాత్రం ఆయన నుంచి విలనిజాన్ని కోరుకుంటున్నారు. 

ముఖ్యంగా 'వర్షం' సినిమాలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఫేస్ టూ ఫేస్ సీన్స్ ను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ గోపీచంద్ ను చాలాసార్లు డార్లింగ్ తో మరోసారి సినిమా చేయాలని, అది కూడా విలన్ గా చేస్తే చూడాలని ఉందంటూ కోరారు. తాజాగా ఇదే విషయమై గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు. తన కొత్త సినిమా 'విశ్వం' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విలన్ గా చేయడం గురించి మాట్లాడారు.

Also Read : చేతికి గాయంతో కనిపించిన మెగాస్టార్.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రభాస్ తో మాత్రమే చేస్తా..

" నేను విలన్ గా చేసిన మూడు సినిమాల ఇంపాక్ట్ అలా ఉండిపోయినట్లు ఉంది. దాని వల్ల నన్ను అందరూ విలన్ క్యారెక్టర్స్ చేయమని చెప్తున్నారు. కానీ నాకు ఇప్పుడు అలా చేసేంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ప్రభాస్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను.." అని అన్నారు. దీంతో గోపీచంద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇక 'విశ్వం' సినిమా విషయానికొస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ రీసెంట్ మూవీస్ పక్కా కమర్షియల్, రామబాణం, భీమా బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అవ్వడంతో.. ఈసారి ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు గోపీచంద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 11 న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు