చేతికి గాయంతో కనిపించిన మెగాస్టార్.. ఆందోళనలో ఫ్యాన్స్

రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి త‌న కుటుంబంతో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ప‌ర‌మర్శించడానికి వ‌చ్చాడు. ఈ క్రమంలోనే చిరు.. ఎడమ చేతికి కట్టుతో కనిపించారు. దీన్ని చూసి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.

New Update
chiru

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేతికి గాయంతో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. 

గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న కుటుంబంతో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ప‌ర‌మర్శించడానికి వ‌చ్చాడు. 

షూటింగ్ లో గాయపడ్డారా?

అయితే చిరు కారులో నుంచి దిగుతున్న సమయంలో ఎడ‌మ‌ చేతికి కట్టుతో కనిపించారు. ఎడ‌మ చేయికి ఫ్యాక్చ‌ర్ అవ్వ‌డంతో ఆయన బ్యాండేజ్‌తో వాడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోల‌తో పాటు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే 'విశ్వంభ‌ర' షూటింగ్‌లోనే ఈ గాయం అయిన‌ట్లు తెలుస్తుంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు