'గేమ్ ఛేంజర్' క్రిస్మస్ కు రావట్లేదు.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన దిల్ రాజు

'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని గతంలో దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. అందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

New Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎప్పుడో మూడేళ్ళ కింద ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేశారు. రిలీజ్ డేట్ రెండు సార్లు మారింది. ఫైనల్ గా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. 

కానీ తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. నిర్మాత దిల్ రాజు స్వయంగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక వీడియోను విడుద‌ల చేశాడు. అందులో దిల్ రాజు మాట్లాడుతూ.." అంద‌రికి విజ‌యద‌శ‌మి శుభాకాంక్ష‌లు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కార‌ణం గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్. ముందుగా ఈ సినిమాను క్రిస్మస్​కు రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నాం కానీ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా చూస్తున్న‌ప్ప‌డు క్రిస్మస్ కంటే సంక్రాంతికి బాగుంటుంద‌ని నాతో పాటు నా డిస్టిబూటర్స్ అన్నారు. 

సంక్రాంతికి కలుద్దాం..

అయితే ఈ ఆలోచ‌న‌ను చిరంజీవి ద‌గ్గ‌రికి తీసుకువెళ్లం. ఎందుకంటే చిరు విశ్వంభ‌ర కూడా సంక్రాంతికే ఉంది. దీంతో ఈ విష‌యంపై చిరంజీవితో యూవీ క్రియేష‌న్స్ వారితో చ‌ర్చించ‌గా.. వారు సానుకూలంగా స్పందించారు. విశ్వంభ‌ర కూడా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. డిసెంబ‌ర్ లోప‌ల పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు కూడా కంప్లీట్ అవుతాయి. 

అయితే మాకోసం త‌మ సినిమాను వాయిదా వేసుకున్న చిరంజీవి అలాగే విశ్వంభ‌ర టీమ్‌కి ధ‌న్యవాదాలు. ఇక‌ గేమ్‌ఛేంజర్ సంక్రాంతికి రావ‌డం క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్లే. ఈ సినిమా కోసం డే అండ్ నైట్ మా టీమ్ క‌ష్ట‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నాం. సంక్రాంతి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి అన్ని అప్‌డేట్‌ల‌ను ప్ర‌కటిస్తాం.." అని అన్నారు. ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు