/rtv/media/media_files/2024/12/01/nTyBAdAW0NHv4z6gpHbp.jpg)
హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం ఒకప్పుడు బాలీవుడ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు టాలీవుడ్ లోనే ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. మన తెలుగులో 'బాహుబలి' నుంచి లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ ట్రెండ్ ను స్టార్ హీరోలతో పాటూ యంగ్ హీరోలు సైతం ఫాలో అవుతున్నారు. ఈ మధ్య సీక్వెల్స్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. 'బాహుబలి' తర్వాత తెలుగులో చాలానే సీక్వెల్స్ వచ్చాయి.
సుకుమార్ రేర్ రికార్డ్..
వాటిలో కొన్ని సక్సెస్ అవ్వగా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే ఈ సీక్వెల్స్ తీయడంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు ఓ అరుదైన ఘనత ఉంది. అదేంటంటే.. సుకుమార్.. ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ ను తీశాడు. అదికూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కావడం విశేషం. సుకుమార్ డైరెక్టర్ గా పరిచయం అయింది అల్లు అర్జున్ 'ఆర్య' సినిమాతో. ఈ మూవీ సుక్కు- బన్నీ ఇద్దరి కెరీర్ లో చాలా స్పెషల్.
Also Read : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా?
2004 లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా 'ఆర్య2' వచ్చింది. 2009 లో విడుదలైన ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 'ఆర్య2' తర్వాత 12 ఏళ్లకు మళ్ళీ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో 'పుష్ప ది రైజ్' మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ మూవీతో సుకుమార్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప 2' రాబోతుంది. అలా అల్లు అర్జున్ తో సుకుమార్ రెండు సీక్వెల్స్ ను తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. సుకుమార్ తప్ప ఇప్పటిదాకా మరే డైరెక్టర్ ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ తీయడం అనేది జరగలేదు.
Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?