/rtv/media/media_files/2026/02/16/dhruv-vikram-2026-02-16-11-32-05.jpg)
Dhruv Vikram
Dhruv Vikram: చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తాజాగా “బైసన్” అనే స్పోర్ట్స్ యాక్షన్ సినిమాతో భారీ హిట్ సాధించాడు. ఆ సినిమా విజయంతో ఆయన తర్వాతి ప్రాజెక్ట్పై ఆసక్తి పెరిగింది. మొదట ఆయన మణిరత్నం దర్శకత్వంలో రొమాంటిక్ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తారని కూడా ప్రచారం జరిగింది.
Dhruv Vikram Rukmini Vasanth Rom-Com
Dhruv Vikram & Rukmini Vasanth For a Rom-Com ⏳❤️
— Siddarth J (@ursSiddarthJ) February 14, 2026
Bilingual...!! pic.twitter.com/RzjDWmRTW4
ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ధ్రువ్ విక్రమ్ - రుక్మిణి వసంత్ కలిసి సినిమా చేయడం నిజమేనట. అయితే ఈ చిత్రానికి మణిరత్నం కాకుండా కొత్త దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీపక్ రెడ్డి తన షార్ట్ ఫిల్మ్ “మనసానమః”తో మంచి పేరు సంపాదించారు. ఈ కొత్త సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో మరో హీరోయిన్గా శ్రీలీల(SreeLeela) కూడా నటించనుందని టాక్.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో ధ్రువ్ విక్రమ్ను తెలుగులో పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
Follow Us