కార్తీ క్షమాపణపై స్పందించిన పవన్‌కల్యాణ్‌.. ఏమన్నాడంటే?

కోలీవుడ్ హీరో కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ప్రజా ప్రతినిధులుగా మనం బాధ్యతతో ఉండాలని పేర్కొన్నారు.

New Update
pawan

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై కోలీవుడ్ హీరో కార్తీ నిన్న 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ కామెడీ చేశారు.

అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. దాంతో కార్తీ స్పందిస్తూ.. పవన్ కు క్షమాపణలు చెప్పారు. తనకు పవన్‌కల్యాణ్‌ అంటే ఎంతో గౌరవం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు. తానూ వేంకటేశ్వరస్వామి భక్తుడినేనని అన్నారు. తానెప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 

అయితే కార్తీ ట్వీట్ కు పవన్ కళ్యాణ్ తాజాగా రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు." సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, మీ తక్షణ స్పందనను అభినందిస్తున్నా. తిరుపతి లాంటి ధార్మిక స్థలాలు, లడ్డూ లాంటి ప్రసాదాలు.. ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరంకోట్లాది మంది భక్తుల భావోధ్వేగానికి సంబంధించిన అంశం. ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. 

బాధ్యతతో ఉండాలి..

మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. సంస్కృతి, సంప్రదాయాల విషయంలోప్రజా ప్రతినిధులుగా మనం బాధ్యతతో ఉండాలి. విలువలను పెంపొందించేందుకు ఎప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం, ప్రతిభతో సినిమాను సుసంపన్నం చేస్తున్న మీపై నాకు అభిమానం ఉంది" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే కార్తీ కొత్త సినిమా 'సత్యం, సుందరం' మూవీ సక్సెస్ అవ్వాలని మూవీ టీమ్ అందరికీ తన బెస్ట్ విషెస్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు