'బొమ్మరిల్లు' షూటింగ్.. ఆ చిన్న సీన్ కోసం 35 టేకులు తీసుకున్న జెనీలియా

'బొమ్మరిల్లు' షూటింగ్ లో జెనీలియా తనపై కోపంతో వెళ్లిపోయిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు.' ఓ సీన్‌లో తింటావా అనే డైలాగ్ ఉంది. దీని కోసం జెనీలియా 35 టేక్‌లు తీసుకుంది. రాత్రి 10 గంట‌ల‌కు మొద‌లుపెడితే తెల్ల‌వారేవ‌రకు తీశాం' అని అన్నారు.

New Update
genelia

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో 'బొమ్మరిల్లు' సినిమా కూడా ఒకటి. సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు కెరీర్స్ ను టర్న్ చేసింది. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వ‌డంతో థియేటర్లో 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. 

ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌ 'బొమ్మరిల్లు భాస్కర్‌'గా మారాడు. ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ ఒక ఇంట‌ర్వ్యూలో పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో జెనీలియా తనపై కోపంతో వెళ్లిపోయిందని, ఓ చిన్న సీన్ కోసం రాత్రంతా షూట్ చేసాం అని అన్నారు.

Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. షూటింగ్ లో జాయిన్ అయిన పవన్

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. " సినిమా మొద‌టిరోజు షూటింగ్‌లో ఐస్‌క్రీమ్ సీన్ షూట్ చేశాం. జెనీలియా, సిద్దార్థ్ అప్పుడే వ‌చ్చి జాయిన్ అయ్యారు. ఈ సీన్‌లో తింటావా అనే ఒక డైలాగ్ ఉంది. అయితే ఈ సీన్ కోసం రాత్రి 10 గంట‌ల‌కు మొద‌లుపెడితే తెల్ల‌వారేవ‌రకు తీశాం. క‌నీసం 35 టేక్‌లు తీసుకున్నాను. 

కోపంతో వెళ్ళిపోయింది...

దీంతో జెనీలియా కోపంతో నా ద‌గ్గ‌రికి వ‌చ్చి ఎంటి రెండు ముక్క‌ల డైలాగ్ చెప్ప‌లేనా నేను అంటూ నేను ఈ సినిమా చేయ‌ను అంటూ వెళ్లిపోయింది. అయితే ఆ రోజు షూటింగ్‌కు అల్లు అర్జున్ వ‌చ్చాడు. తానే జెనీలియా ద‌గ్గ‌రికి వెళ్లి అలా చేయ‌కు. ఇది మంచి సినిమా, మంచి ద‌ర్శ‌కుడు మొద‌టిరోజే జ‌డ్జ్ చేయ‌కు.. ఈ సినిమా చేయి అంటూ త‌న‌ను ఒప్పించాడు" అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
తాజా కథనాలు