/rtv/media/media_files/2025/03/14/5b7vgYSKXOWhmhUzqeIp.jpg)
Prabhas mother Bhagyashree
Actress Bhagya Shree: రీసెంట్ గా 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నటి భాగ్యశ్రీ గాయాలపాలయ్యారు. ఆమె నుదుటికి తీవ్రమైన గాయమవడంతో వైద్యులు 13 కుట్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ బెడ్ పై భాగ్యశ్రీని చూసి సినీ అభిమానులు కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఇటీవలే పికిల్ బాల్ ఆడుతుండగా.. ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ సమయంలో గాయపడి ఉంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని , త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ!
#Bhagyashree pic.twitter.com/gWDnvdQlYw
— Diksha Sharma (@DikshaS17150327) March 13, 2025
Also Read: Tamil Nadu: ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత - Rtvlive.com
తొలి సినిమాకే...
అప్పట్లో భాగ్యశ్రీ సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో సంచలనం సృష్టించింది. 1989 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలి మూవీతోనే ఉత్తమనటిగా ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత హిందీ, కన్నడ, భోజపూరిలో పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. భాగ్యశ్రీ 1989లో వ్యాపార వేత్త హిమాలయ దాసానిని వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు, అభిమన్యు దాసాని, 2019లో 'మర్ద్ కో దర్ద్ నహీ హోతాలో' తన నటనకు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు ఆమె కూతురు కూడా రీసెంట్ గా 'మిథ్య' అనే సీరీస్ తో తెరంగేట్రం చేసింది.
Also Read: Actress Saanve Megghana: తమిళంలో హిట్ కొట్టిన శాన్వి.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టరస్ అవార్డు