Bhagavanth Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' సినిమాకు అవార్డుల పంట పండింది. ఇటీవలే ఉత్తమ చిత్రంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించించగా.. ఇప్పుడు నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో తెలుగు నుంచి బాలయ్య 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. దీంతో నందమూరి అభిమానులు, చిత్రబృందం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే 'భగవంత్ కేసరి' సినిమాకు నేషనల్ అవార్డు వరించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
నేషనల్ అవార్డుకు కారణాలు
అమ్మాయిలను స్ట్రాంగ్ గా ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఇది సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే అంశం. లాగే ప్రస్తుత సమాజంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహనా కల్పించేలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలను కూడా సినిమాలో చేర్చారు. ఆడపిల్ల లేడీ పిల్ల లెక్క కాదు, పులి పిల్ల లెక్క ఉండాలి అంటూ సినిమాలో మహిళా సాధికారతను హైలైట్ చేశారు. ఇలా సామజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ సినిమాను తెరకెక్కించడమే ఆరోజు నేషనల్ అవార్డుకి కారణమని తెలుస్తుంది. ఈ సినిమాలో కంటెంట్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్య 'భగవంత్ కేసరి' పాత్రలో ఒదిగిపోయారు. తెలంగాణ యాసలో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, శ్రీలీలతో ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో కాజల్, అర్జున్ రాంపాల్, సుబ్బరాజ్, శరత్ కుమార్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
RTV తో అనిల్
ఇదిలా ఉంటె గతంలో 'భగవంత్ కేసరి' కి నేషనల్ అవార్డు ప్రకటించడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి RTV తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ..'' 'భగవంత్ కేసరి' కి అవార్డు ప్రకటించగానే చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ రిలీజ్ అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను.. 'భగవంత్ కేసరి' నేను చేసిన అన్ని సినిమాల కంటే ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ ! ఎందుకంటే ఈ సినిమా జానర్ అలాంటిది. ఇప్పటికే ఈ సినిమాకు సైమా, ఐఫా, గద్దర్ అవార్డ్స్ వచ్చాయి. ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు రావడం హ్యాపీగా అనిపించింది. ''అమ్మాయిని స్ట్రాంగ్ గా ఎలా పెంచాలి'' అనే ఒక చిన్న కంటెంట్ ని నమ్ముకొని సినిమాను ముందుకు తీసుకెళ్ళాం. అదే ఈరోజు నేషనల్ అవార్డుకి కారణమని భావిస్తున్నాము. ఈ సినిమాలో కంటెంట్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే సినిమాలోని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీక్వెన్స్ చిన్నపిల్లలకు అవగాహన కల్పించేలా ఉంటుంది. ఇలా కంటెంట్ ఓరియెంటెడ్ గా వెళ్ళాము కాబట్టే ఈ విజయం పాజిబుల్ అయ్యింది'' అని తెలిపారు.
Also Read: 71st National Film Awards 2025: డైరెక్టర్ సుకుమార్ కూతురి సత్తా.. తొలి సినిమాతో నేషనల్ అవార్డు