Kubera Movie: ఏపీలో 'కుబేరా' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

'కుబేరా' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించింది. విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.

New Update

Kubera Movie:  'కుబేరా' చిత్ర బృందానికి  ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 20న మూవీ థియేటర్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో  జీఎస్టీతో కలిపి రూ.75  పెంచుకునేలా వీలు కల్పించింది.  విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఇక తెలంగాణాలో టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్ లో ఎప్పటి ధరలే కొనసాగనున్నాయి. అయితే తెలంగాణలో టికెట్ ధరలు పెంపు కోసం చిత్రబృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. 

నాగార్జున- ధనుష్

టాలీవుడ్ కింగ్ నాగార్జున- ధనుష్ ప్రధాన పాత్రలో నటించి 'కుబేరా' చిత్రానికి  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ధనుష్- నాగార్జున, రష్మిక- ధనుష్ మధ్య సన్నివేశాలు ఆసక్తిని పెంచాయి. మరి థియేటర్స్ లో ధనుష్- నాగార్జున ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. 

U/A సర్టిఫికెట్

కుబేరా చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు పలు మార్పులు చేసిన తర్వాత ఈ సినిమా నిడివిని 3 గంటల 2 నిమిషాలకు కుదించారు. డబ్బు, మాఫియా, ఎమోషన్స్ వంటి అంశాలతో ఒక సోషల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 

Also Read: HBD Kajal: ట్విట్టర్ లో ట్రెండవుతున్న కాజల్.. ఈ మ్యాషప్ వీడియోలు చూస్తే ఫిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు