Kannappa: ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్! ఎంత పెరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ. 50 పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజులు వరకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.

New Update

Kannappa: మంచు విష్ణు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'కన్నప్ప' రేపు థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం  'కన్నప్ప' చిత్రబృందానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 50 (జీఎస్టీ అదనం) పెంచుకునే వెసులుబాటు కల్పించింది. పెరిగిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజులు వరకు మాత్రమే అమల్లో ఉండనున్నట్లు  తెలిపింది. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు యథాతధంగా ఉన్నాయి. 

దాదాపు పదేళ్లు 

ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికాలో 'కన్నప్ప' ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో ఈరోజు సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. శివ భక్తుడు 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్, బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప పై  మంచు విష్ణు దాదాపు పదేళ్లు పనిచేశారు. 2014 లో కథా హక్కులు కొనుగోలు చేయడంతో మొదలై  2025లో పూర్తయింది.  

మూడు తరాలు 

'మహాభారతం' సీరియల్  ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప' చిత్రానికి దర్శకత్వం వహించారు.  సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ సినిమా ద్వారా మంచు వారసులంతా తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్నాయి. మంచు విష్ణు కొడుకు, ముగ్గురు కుమార్తెలు క్యామియో రోల్స్ లో కనిపించబోతున్నారు. దీంతో మంచు వారి మూడు తరాలు ఒకే ఫ్రేమ్ లో సందడి చేయనున్నారు. 

Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

Advertisment
Advertisment
తాజా కథనాలు