ఆంధ్రప్రదేశ్ లో అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. ఆయన హీరోగా నటించిన 'పుష్ప2' సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ సీజ్ అయ్యాయి. డిసెంబర్ 05 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప-2’ సినిమా సూపర్ హిట్ టాక్తో నడుస్తోంది.
అయితే తాజాగా కుప్పంలో 'పుష్ప2' సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులిచ్చారు.