/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-KCR-2-1-jpg.webp)
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి ప్రజలను కలిశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన స్వగ్రామమైన చింతమడక నుంచి 540 మంది 9 బస్సుల్లో కేసీఆర్ ఉన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న కేసీఆర్.. వారిని కలిశారు. గది నుంచి బయటకు వచ్చి.. తనను చూసేందుకు వచ్చిన జనాలకు అభివాదం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్తులకు అభివాదం చేశారు. కాగా, కేసీఆర్ను చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామంతా కేసీఆర్ వెంటే ఉంటాని చెప్పారు. కాగా, చింతమడక గ్రామస్తులు కేసీఆర్ను కలిసిన సమయంలో హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు.
తెలంగాణను సాధించిన జాతిపిత, దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ గారిని చూసేందుకు అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
తమ అభిమాన నేతను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
బుధవారం… pic.twitter.com/8jY4eBEY2D
— BRS Party (@BRSparty) December 6, 2023
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 39 సీట్లు మాత్రమే గెలిచి, అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. కాన్వాయ్, సెక్యూరిటీ ఏవీ వద్దంటూ ఒంటరిగానే తన ప్రైవేట్ కారులో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.