జాబిల్లి యాత్రలో చైనా మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరింది. జూన్ 2న చంద్రడి దక్షిణ ధృవంలోని అయిట్కిన్ బేసిన్లో దిగింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా దక్షిణ ధృవాన్ని అన్వేషించలేదు. అక్కడ మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6 వ్యోమనౌక.. మంగళవారం తిరిగి భూమిపైకి చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందించారు.
పూర్తిగా చదవండి..China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి
ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరి.. చివరికి జూన్ 25 మట్టి నమూనాలతో భూమిపైకి విజయవంతంగా చేరుకుంది.
Translate this News: