Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు...హోం మినిస్టర్‌ తో భేటీ!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశం అవ్వనున్నారు. అంతేకాకుండా కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి.

Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
New Update

Chandrababu Naidu Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో (Amit Shah) సమావేశం అవ్వనున్నారు. అంతేకాకుండా కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసిన విషయం తెలిసిందే. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.

మంగళవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు.మంగళవారం రాత్రి దేశ రాజధానిలోనే ఉండనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని సమాచారం.

Also Read: బంధువులు కాదు రాబందులు..టార్చర్‌ భరించలేక యువజంట ఆత్మహత్య!

#chandrababu-naidu #amith-shah #politics #delhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి