ChandraBabu: ఇక నుంచి కొత్త చంద్రబాబును చూస్తారు...అంటూ బాబు కీలక వ్యాఖ్యలు!

ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని..బ్యూరో క్రాట్‌ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు అంటూ బాబు ఎంపీల సమావేశంలో తెలిపారు.

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్
New Update

ChandraBabu: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ఏపీలో , కేంద్రంలో ఎలా వ్యవహరించాలనే దాని గురించి ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ కూడా విర్రవీగొద్దని , ప్రజలిచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని సమాజ సేవ చేసుందుకు ముందుండాలని మార్గనిర్దేశం చేశారు.

ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని అన్నారు. బ్యూరో క్రాట్‌ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలు అందరు తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా మీతో మాట్లాడతాను.

ఇకనుంచి ప్రతి అంశం గురించి నేను వింటాను.. నేనే చూస్తాను. ఇక ముందు రాజకీయ పరిపాలన ఉంటుంది. అందరూ కలిసి పని చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి పనిచేయాలి. ఎవరి బౌండరీలు ఏమిటో నేను అందరికీ స్పష్టంగా చెపుతాను. అందరు ఎవరి పరిధిలో వారు పని చేయాలి. అందరం కలిసి కార్యకర్తలు, నేతలకు న్యాయం చేయాలి. ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు, నేతలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి.

వారి కష్టం, వారి త్యాగం, కృషి వలనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12వ తేదిన ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ సారి ఎన్నికైన ఎంపీల టీమ్ చాలా బాగుంది. గతంలో ఎర్రంనాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్ ఉంది. ఈ టీమ్ ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగా పని చేయాలి.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also read: మెగాస్టార్ ఇంటికి పిఠాపురం ఎమ్మెల్యే!

#mp #chandrababu #tdp #meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి