Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఈరోజు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీయే కూటమి మీటింగ్‌కు హాజరు కానున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కలవనున్నారు.

Chandrababu: పవన్‌ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేను : చంద్రబాబు
New Update

Delhi : ఈరోజు ఢిల్లీకి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీయే కూటమి (NDA Alliance) మీటింగ్ కు హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ విడివిడిగానే ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి రాత్రి 9గంటలకు ఉండవల్లికి చంద్రబాబు (Chandrababu) చేరుకోనున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కలవనున్నారు. ఆ తర్వాత 10 గంటలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

మూడోసారి ముచ్చటగా మోదీ..

ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ జరగనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. మ్యాజిక్ ఫిగర్ 272కి 31 సీట్ల దూరంలో బీజేపీ ఉంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్ర పక్షాలు కీలకం. నడ్డా నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ కానున్నారు.

Also Read : ఓటమి తట్టుకోలేక వైసీపీ అభిమానులు మృతి

#andhra-pradesh #pawan-kalyan #chandrababu #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe