Onion Exports: ఎన్నికల వేళ ఉల్లి పై కేంద్రం కీలక నిర్ణయం.. 

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఉల్లి ఎగుమతుల పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధం ఎత్తివేస్తారని వ్యాపారులు ఊహించినా అది జరగలేదు. ఈ నిర్ణయంతో మన దేశం నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి.  

New Update
Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?

Onion Exports: ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరవధికంగా పొడిగించింది. గతంలో మార్చి 31 వరకు నిషేధం అమలులో ఉండగా, ఇప్పుడు దానిని పొడిగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో ఉల్లి ద్రవ్యోల్బణం పెరగకుండా చూసేందుకు, దాని ఎగుమతిపై నిషేధాన్ని పొడిగించాలని నిర్ణయించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం ఎత్తివేస్తారని వ్యాపారులు ఊహించినా అది జరగలేదు. కొత్త సీజన్‌లో పంటల సరఫరా పెరగడంతో పాటు తగ్గుతున్న ధరల దృష్ట్యా నిషేధాన్ని(Onion Exports) పొడిగించాలని నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉందని ఎగుమతి సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్‌లలో డిసెంబర్‌లో ఉల్లి ధరలు 100 కిలోలకు రూ.4,500 నుంచి రూ.1,200కి పడిపోయాయని అధికారి తెలిపారు. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉల్లి సరఫరాలో దేశీయ అంతరాన్ని పూరించడానికి భారతదేశం నుండి దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి.  నిషేధం తరువాత వాటిలో చాలా దేశాలు అధిక ధరలతో పోరాడుతున్నాయి. ఎగుమతులకు(Onion Exports) సంబంధించిన నిపుణులు చెబుతున్నదాని  ప్రకారం, భారతదేశం తీసుకున్న ఈ చర్య ప్రత్యర్థి ఎగుమతిదారులకు అధిక ధరలను వసూలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది.  ఎందుకంటే, ఉల్లిని దిగుమతి చేసుకునే దేశాలకు వేరే అవకాశం లేదు. దీంతో ధర ఎక్కువైనా కొనక తప్పదు. 

Also Read:  జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు?

డిసెంబర్ 8, 2023 న ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతి(Onion Exports)ని నిషేధించిన విషయం తెలిసిందే. 2023 రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి 2.27 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. అంతర్-మంత్రిత్వ బృందం నుండి ఆమోదం పొందిన తర్వాత, కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్నేహపూర్వక దేశాలకు ఉల్లి ఎగుమతి అనుమతిస్తారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఎన్‌సిఇఎల్) ద్వారా యుఎఇ, బంగ్లాదేశ్‌లకు 64,400 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అంతకుముందు, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి అక్టోబర్ 2023 లో రిటైల్ మార్కెట్లలో బఫర్ ఉల్లిపాయ స్టాక్‌ను రాయితీపై కిలోకు రూ. 25 చొప్పున విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

Advertisment
తాజా కథనాలు