NEET Paper Leak : నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

నీట్‌ పేపర్‌ లీక్ అయ్యిందంటూ...ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ,జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది.

New Update
NEET Paper Leak : నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

JD Lakshmi Narayana Tweet : నీట్‌ పేపర్‌ లీక్ (NEET Paper Leak) అయ్యిందంటూ... ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది. ఆ ట్వీట్‌ లో ఒక దేశాన్ని నాశనం చేయాంటే ఆటం బాంబులు
అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌ట అదే నాశ‌నం అవుతుంది. అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగులు చ‌నిపోతారు అంటూ ప‌లు ఉదాహరణలను ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌ రాశార‌ని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan).. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఆయన అంగీక‌రించారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం ప్రస్తుతం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.

Also read: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Advertisment
తాజా కథనాలు