/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-4.jpg)
Nizamabad: నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్లూర్ మండలం దాస్నగర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. డ్రైవర్ ఆజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు కారు డ్రైవర్ను చితకబాదారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.