Hyderabad : దుండిగల్ లో కారు బీభత్సం.. అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!

మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్‌ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad : దుండిగల్ లో కారు బీభత్సం.. అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!
New Update

Dundigal : మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. దుండిగల్‌ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగం(Over Speed) తో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహీంద్రా యూనివర్సిటీ(Mahindra University) కి చెందిన విద్యార్థి అన్నమనేని మేఘాంశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. గాయపడిన వారిని సాయి మానస్‌, శ్రీచరణ్‌రెడ్డి, అర్నవ్‌లగా గుర్తించారు.

వీరంతా కూడా మహీంద్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం సీసాలు(Liquor Bottles) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read: రాత్రి నిద్ర పట్టాలంటే..ఓ పెగ్‌ ఎక్స్‌ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా!              

#car-accident #dundigal #hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి