/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-2-1-jpg.webp)
Telangana Cabinet: కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్తో పోటీ చేసిన వాళ్లకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లో రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదని చెప్పారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ (KCR) చేసిన తప్పులు తాము చేయబోమన్నారు. రాష్ట్రంలో రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు.
అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ను (Telangana PCC Chief) సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవని, సర్ ప్లస్ కొంటున్నామని చెప్పారు. మహిళల ఉచిత బస్సు పథకంతో, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టున పడిందని సీఎ రేవంత్ తెలిపారు.
Also Read: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!