CM Revanth Reddy: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

TG: పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

CM Revanth Reddy: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
New Update

CM Revanth Reddy: పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఇబ్బందులు వస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. మెదక్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపడి గాయపడిన ఐదుగురికి వైద్యం అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe