/rtv/media/media_files/Wwq3Z5eJQlkCGdRs9m0W.jpg)
Tirupati: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక పిలుపునిచ్చింది. తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని సూచించింది. ఈ మేరకు భక్తులంతా ధీపారాధన సమయంలో 'క్షమ మంత్రం' చదవాలని పండితులు సూచించారు. 'ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..' మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలని చెప్పారు.
Purificatory Shanti Homam Concludes
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 23, 2024
Ritual Held to Ward Off Doshas and for the Benefit of Devotees - TTD EO
Devotees Should Recite the Kshama Mantra in the Evening - Archakas pic.twitter.com/kpxqcDbgVb
'ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది. శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ "క్షమ మంత్రం" పఠించగలరు' అని టీటీడీ పోస్ట్ పెట్టింది.