/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Investment-jpg.webp)
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు విదేశీ మదుపర్లు వరుసపెట్టి అమ్మకాలు చేశారు. ఇది దేశీ మార్కెట్ మీద ప్రభావం చూపించింది. దీంతో సెన్సెక్స్ 1176 పాయింట్ల పతనంతో 78,041 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 364 పాయింట్లు క్షీణించి, 23,587 దగ్గర ముగిసింది. సెన్సెక్స్లోని 30 షేర్లలో 20 పెరగ్గా, 10 క్షీణించాయి. నిఫ్టీ స్టాక్స్ 45 క్షీణించగా, 5 మాత్రమే పెరిగాయి. ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఈరోజు క్షీణించాయి. నిఫ్టీ రియల్టీ 3.84%, నిఫ్టీ బ్యాంక్ 2.58%, నిఫ్టీ IT 2.42% మరియు నిఫ్టీ ఆటో 2.07% అతిపెద్ద క్షీణతను నమోదు చేశాయి.దీంతో ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరై.. రూ.441 లక్షల కోట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.03 దగ్గర ముగిసింది.
వచ్చే ఏడాది వడ్డీ రేట్లలో మూడు లేదా నాలుగు సార్లు కోతలు ఉండొచ్చని మార్కెట్ అంచనా వేసింది. కానీ ఫెడ్ మాత్రం రెండుసార్లు మాత్రమే రేట్ల కోత ఉంటుందని చెప్పింది. ఇది నిన్న , ఇవాళ కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీనికి తోడు ఐటీ స్టాక్స్ ఇవాళ బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫటీ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం నష్టపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే మొదలైన ఐటీ స్టాక్స్ తరువాత మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్ లోనూ క్షీణత కనిపించింది. జపాన్కు చెందిన నిక్కీ 0.29%, కొరియా తాలూకా కోస్పి 1.30%, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.058% నష్టపోయాయి.
Also Read: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్