/rtv/media/media_files/2025/06/24/london-to-mumbai-air-india-flight-5-passengers-and-2-crew-members-feels-unwell-mid-air-2025-06-24-09-39-56.jpg)
Air India
ప్రయాణికుల కోసం ఎయిరిండియా సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించనుంది. అంతర్జాతీయ విమాన మార్గాల్లో బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై ఒక ప్రత్యేకమైన సేల్ను ప్రకటించింది. అయితే ఈ సేల్ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు దేశీయ విమానాల బేస్ ఛార్జీపై 25 శాతం, అంతర్జాతీయ విమానాల బేస్ ఛార్జీపై 10 శాతం తగ్గింపును ఎయిర్ ఇండియా అందిస్తోంది.
ఇది కూడా చూడండి: Zomato: జొమాటో యూజర్లకు బిగ్ షాక్.. ఒక్కో ఆర్డర్పై భారీగా పెంచిన ఫీజులు!
తక్కువ ధరకే ప్రీమియం ఎకానమీ క్లాస్..
ఈ సేల్లో ప్రీమియం ఎకానమీ క్లాస్లో టికెట్ల ధరలు కేవలం రూ. 13,300 నుంచి ప్రారంభమవుతాయి. ప్రీమియం ఎకానమీలో ప్రయాణించడం వల్ల ఎక్కువ లెగ్ రూమ్, మంచి ఆహారం, మెరుగైన సేవల వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఇది సాధారణ ఎకానమీ క్లాస్ కంటే మెరుగైన అనుభూతిని ఇస్తుంది. ఇక బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలనుకునేవారి కోసం రిటర్న్ ఛార్జీలు రూ. 34,400 నుంచి మొదలవుతాయి. బిజినెస్ క్లాస్ అంటేనే విలాసవంతమైన ప్రయాణం. ఇందులో ఫ్లాట్ బెడ్లు, విలాసవంతమైన భోజనం, లాంజ్ యాక్సెస్, వేగవంతమైన చెక్-ఇన్ వంటి సేవలు ఉంటాయి. సాధారణంగా చాలా ఖరీదైనదిగా ఉండే బిజినెస్ క్లాస్ ఇప్పుడు ఈ ఆఫర్ వల్ల తక్కువకు లభిస్తుంది. ఈ సేల్ సమయంలో ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో టికెట్లు బుక్ చేసుకునేవారికి ఎలాంటి సులభ రుసుము వసూలు చేయరు.
Air India has announced a special sale on Business Class and Premium Economy tickets for short-haul select international routeshttps://t.co/eOI1OU9E1i
— NDTV Lifestyle (@ndtvLifestyle) September 3, 2025
వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే..
నేరుగా ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి మరిన్ని డిస్కౌంట్లు లభిస్తాయి. ఇంకా 'FLYAI' అనే ప్రోమో కోడ్ ఉపయోగిస్తే, ప్రయాణికులు రూ. 2,400 వరకు తగ్గింపు పొందవచ్చు. వీసా కార్డులతో చెల్లింపులు చేసేవారు 'VISAFly' అనే ప్రోమో కోడ్ ఉపయోగిస్తే, ఏకంగా రూ. 2,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే. సెప్టెంబర్ 2న ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 7కి క్లోజ్ అవుతుంది. ఈ తేదీల్లోగా మీరు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే ఈ ఆఫర్ కింద 2026 మార్చి 31లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
Now, #SeniorCitizens can get #discounts on international flights on #AirIndia.
— Khaleej Times (@khaleejtimes) September 2, 2025
On Tuesday, September 2, customers received an email from the Indian airline, confirming that the discount was 'now live' on their website.https://t.co/sIWtsBUNHMpic.twitter.com/i9WRNKOL3r
ఇది కూడా చూడండి: Money Investment: తక్కువ జీతమా అయినా పర్లేదు.. నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే మీరే ధనవంతులు!