Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్..!

దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ కామెంట్స్ చేశారు.

Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్..!
New Update

EVM War in AP: 2024 ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకుంది. అయితే, తాజాగా EVM మిషిన్లపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ (YS Jagan).. ఈవీఎమ్‌లు వద్దు బ్యాలెట్‌ పేపర్‌ ముద్దు అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు.

Also Read: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!

అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్‌ బ్యాలెట్లే (Ballot Papers) వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్‌లో కూడా EVMలకు బదులుగా పేపర్‌ బ్యాలెట్లు వాడితే మంచిదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ ట్వీట్‌పై తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

దమ్ముంటే జగన్ పులివెందులలో (Pulivendula) రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ట్వీట్ లో పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలని హెచ్చరించారు.

#evm #budda-venkanna #tdp #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe